News March 22, 2025
NGKL: పెద్దకొత్తపల్లి లో38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా లో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా పెద్దకొత్తపల్లి లో 38.8 ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దూర్ 38.7, అచ్చంపేట,వంగూరు38.6, కొల్లాపూర్38.4, ఉప్పునుంతల38.3, బిజినపల్లి 38.1, కల్వకుర్తి,చారకొండ38.0, బల్మూర్37.8 తెలకపల్లి,పెంట్లవెల్లి37.5,నాగర్ కర్నూల్37.0 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 7, 2025
డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

AP: తిరుమలలో DEC 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు EO అనిల్ సింఘాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి టోకెన్ల జారీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చామని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన 2026 FEB నుంచి ఆన్లైన్ కోటా రిలీజ్ చేస్తామన్నారు.
News November 7, 2025
హనుమకొండ: ఐనవోలులో సినిమా షూటింగ్

ఐనవోలు మండలం రెడ్డిపాలెం, రాంనగర్, నందనం గ్రామాల్లో శివభ్రమేంద్ర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. రమేశ్ బాబు దర్శకత్వంలో, సావిత్రమ్మ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్ హీరోగా, శృతి, మౌనికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రాంనగర్లో నటుడు సుమన్పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయనను చూడటానికి స్థానికులు తరలివచ్చారు.
News November 7, 2025
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.


