News September 22, 2025

NGKL: ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్‌

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 25 ఫిర్యాదులు అందినట్లు అదనపు కలెక్టర్‌ అమరేందర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 23, 2025

వరంగల్: కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు..!

image

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలో అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు యువకులు భవాని మాత మాలలను ధరించారు. మండపాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రతిరోజు అలంకరణలు చేయడానికి గాను యువకులు భవానిమాలలు వేసుకున్నారు. మంగళవారం గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

News September 23, 2025

గ్రీవెన్స్‌ డే సమస్యలు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

image

నల్గొండ: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు మరింత కృషి చేయాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 37 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

News September 23, 2025

KNR: ఓపెన్ పదో తరగతి , ఇంటర్ పరిక్షలకు 82% హాజర్

image

కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 82% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు 37 మందికి గాను 32 మంది (91%), ఇంటర్ పరీక్షకు 73 మందికి గాను 58 మంది (79%) హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు నలుగురు హాజరయ్యారని వివరించారు.