News March 15, 2025
NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News January 1, 2026
అద్దంకి: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు దోచేశారు

CBI నుంచి ఫోన్ చేస్తున్నాం.. మనీ లాండరింగ్ కేసులో మీపై సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది చెప్పి సైబర్ నేరగాళ్లు అద్దంకి వాసి వద్ద డబ్బులు కాజేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెయిల్ మంజూరు కావాలంటే డబ్బులు చెల్లించాలని అద్దంకికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు నుంచి 3 వారాల క్రితం రూ.1.23 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News January 1, 2026
ఆదిలాబాద్: యువకుడి సూసైడ్

తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలం హస్నాపూర్కి చెందిన రాథోడ్ సాయికిరణ్(27) డయాలసిస్ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజులుగా మద్యం తాగి వస్తుండటంతో ఈనెల 30న తండ్రి బాపురావు మందలించారు. మనస్తాపం చెంది పురుగు మందు తాగగా కుటుంబీకులు రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
News January 1, 2026
2026లో IPOల జాతర.. లిస్ట్లో జియో, ఫ్లిప్కార్ట్, ఫోన్పే

2026లోనూ IPOల జాతర కొనసాగనుంది. ఈ ఏడాది పలు పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెెట్లో ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.11-12 లక్షల కోట్ల విలువైన పబ్లిక్ లిస్టింగ్కు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది తొలి భాగంలోనే IPOకు రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా సుమారు రూ.6 లక్షల కోట్ల వాల్యుయేషన్తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ పే, జెప్టో, ఓయోతోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు లైన్లో ఉన్నాయి.


