News May 7, 2025
NGKL: భారత్ సమ్మిట్లో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్లో శనివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకూళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణాకు మేలు చేకూరుతుందని, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 29, 2026
VZM: రేపు PGRS రద్దు

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన బడ్జెట్ అవుట్రీచ్ 2026-27 సమీక్ష, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ (DRC) సమావేశం, పీ-4 కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News March 29, 2026
సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వండి: మార్కాపురం కలెక్టర్

మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.
News March 29, 2026
మంగళగిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. CM చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొని, పార్టీ భారీ జెండాను ఆవిష్కరించారు. NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ ప్రస్థానాన్ని, భవిష్యత్తు లక్ష్యాలను CBN వివరించారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


