News March 6, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన కేతావత్ మైబు నాయక్(23) బుధవారం సాయంత్రం మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు. మైబు నాయక్ అందరితో ప్రేమగా, మైత్రిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

Similar News

News November 8, 2025

సినిమా అప్డేట్స్

image

* 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తుడరుమ్’ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమాలు ఎంపికయ్యాయి.
* కమెడియన్ సత్య హీరోగా ‘మత్తువదలరా’ ఫేమ్ రితేశ్ రాణా డైరెక్షన్‌లో మూవీ ప్రారంభమైంది.
* కమల్ హాసన్ హీరోగా ‘KHAA-హంట్ మోడ్ ఆన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ సినిమా రూపొందనుంది. స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బుమణి, అరివు మణి దర్శకత్వం వహిస్తారు.

News November 8, 2025

కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

image

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.

News November 8, 2025

పావలా వడ్డీకే రుణాలు: తిరుపతి కలెక్టర్

image

KVBపురం(M)లో రాయల చెరువు తెగి ఐదు ఊర్లు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద ధాటికి 57 మూగ జీవులు(26 ఆవులు, 18 గేదెలు, 13 గొర్రెలు) చనిపోయినట్లు సమాచారం. కొట్టుకుపోయిన జీవాలు కొన్ని ఇంటి బాట పట్టాయి. పశువులను కోల్పోయిన వారిని నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారన్నారు.