News February 24, 2025
NGKL: రెస్క్యూ కొనసాగుతుంది: మంత్రి

ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలను మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు నేతలు సమీక్షించారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నీటిప్రవాహం సహాయ కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలు బృందాలు పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.
Similar News
News February 24, 2025
వికారాబాద్: 93ఎకరాల భూమి.. 62మందికి చెక్కులు

పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందించామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. 93.16 ఎకరాల భూమికి 62 మంది రైతులకు నష్టపరిహారం అందించామన్నారు.
News February 24, 2025
ఏడాదిలో 300 రోజులు అదే తింటా: మోదీ

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్లోని భాగల్పూర్లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్ఫాస్ట్లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్లో ప్రకటించారు.
News February 24, 2025
యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు దేవస్థానం వారు సోమవారం శుభవార్త చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు టోల్గేట్ రుసుము మినహాయింపు ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రుడు తెలిపారు. అలాగే విచ్చేయు భక్తులకు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.