News February 13, 2025
NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 7, 2025
‘గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఖాళీగా ఉన్న 2 గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయని, ఆసక్తి గల వైద్యులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని సూచించారు. నెలవారీ వేతనం రూ.1.50 లక్షలుగా నిర్ణయించారని తెలిపారు. వివరాలకు 8499061999, 9491481481 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News November 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 59 సమాధానాలు

1. అర్జునుడి శంఖం పేరు ‘దేవదత్తం’.
2. రుక్మిణి సోదరుడు ‘రుక్మి’.
3. అట్ల తద్ది పండుగ ‘ఆశ్వయుజ మాసం’లో వస్తుంది.
4. సుమంత్రుడు ‘దశరథుడి’ రథసారథి. రాముడి రథసారథిగా కూడా ఉన్నాడని కొందరు నమ్ముతారు.
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ‘కళ్యాణ కట్ట’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 7, 2025
RBI సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం: సంజయ్

రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, విధానపరమైన నిర్ణయాలే దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. RBI చేపట్టిన సంస్కరణల వల్లే 2018లో నష్టాల్లో ఉన్న SBI ఇప్పుడు 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరిందన్నారు. 27గా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను 12కి తగ్గించడం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి కారణమని SBI బ్యాంకింగ్, ఎకనమిక్స్ కాన్క్లేవ్-2025లో అన్నారు.


