News August 29, 2025

NGKL: సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 460 GPలకు, 4,102 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి ప్రచురించామని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి, అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.

Similar News

News September 2, 2025

మీకు కన్నడ వచ్చా: రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం

image

కర్ణాటక పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘మీకు కన్నడ వచ్చా?’ అని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య అడిగారు. ‘కన్నడ నా మాతృ భాష కాకపోయినా అన్ని భాషలను గౌరవిస్తాను. ప్రతిఒక్కరు తమ భాషను కాపాడుకోవాలి. కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’ అని ప్రెసిడెంట్ బదులిచ్చారు. కాగా కర్ణాటకలో ఉండేవారు తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని ఇటీవల సిద్దరామయ్య చెప్పడం వివాదాస్పదమైంది.

News September 2, 2025

తొర్రూర్: వైజాగ్ టూర్‌కు స్పెషల్ బస్సు

image

తొర్రూరు పరిసర ప్రాంత ప్రజలు వైజాగ్ యాత్ర స్పెషల్ సర్వీసును వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పద్మావతి కోరారు. ఈ బస్సు ఈనెల 12న ఉ.5 గం.కు తొర్రూరు నుంచి బయలుదేరి పరిటాల హనుమాన్ ఆలయం, విజయవాడ కనకదుర్గ గుడి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, ఆర్కే బీచ్ సందర్శించి 14న ఉదయం తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. యాత్ర టికెట్ ధర పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,300గా నిర్ణయించినట్లు తెలిపారు.

News September 2, 2025

సెప్టెంబర్ 2: చరిత్రలో ఈ రోజు

image

1956: నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ జననం
1965: భారత తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ జననం
1968: నటి, రాజకీయ నాయకురాలు జీవిత జననం
1971: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జననం (ఫొటోలో)
2009: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం(ఫొటోలో)
2022: తెలంగాణ ఉద్యమ నేత మందాడి సత్యనారాయణరెడ్డి మరణం