News April 8, 2025
NGKL: స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. DEOకు ఫిర్యాదు

నాగర్కర్నూల్ జిల్లా నాగనూల్ KGBVలో 9వ తరగతి విద్యార్థిని యామిని చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరే టీచర్తో తమ కూతురు మంచిగా ఉంటుందనే అక్కసుతో కళ్యాణి అనే టీచర్ కక్షసాధింపు చర్యలపై మనస్తాపం చెంది యామిని ఆత్మహత్యకు యత్నించిందన్నారు. టీచర్ కళ్యాణిపై చర్యలు చేపట్టాలని DEO రమేశ్ కుమార్కు స్టూడెంట్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
Similar News
News July 9, 2025
సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మహర్దశ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.
News July 9, 2025
ASF: ఉప్పొంగిన ప్రాణహిత

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
News July 9, 2025
HYD: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.