News December 13, 2025

NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

image

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 13, 2025

వికారాబాద్: సర్పంచ్‌ ఎన్నికలు.. పూర్తి వివరాలు

image

రేపు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ డివిజన్లోని 175 జీపీలు, 1520 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వికారాబాద్ మండలం 21, ధరూర్ 34(5 ఏకగ్రీవం), మోమిన్‌పేట్ 29, నవాబుపేట 32(2 ఏకగ్రీవం), బంట్వారం 12, మర్పల్లి 29(3 ఏకగ్రీవం), కోట్పల్లి 18 (5 ఏకగ్రీవం) GPలు ఉన్నాయి. ఏకగ్రీవాలను మినహాయించి మిగతా GPలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.

News December 13, 2025

నెల్లూరు: నిన్న అనిల్ పక్కన.. నేడు మంత్రి నారాయణ పక్కన..!

image

నిన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పక్కన విలేకరుల సమావేశంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఇవాళ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 37వ డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు నగర YCP అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ TDP కండువా కప్పుకున్నారు. కాగా.. నిన్న మంత్రి నారాయణ, MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసి అనిల్ కుమార్ మాట్లాడారు. ఇది జరిగిన 24 గంటల్లోనే అనిల్ రైట్ హ్యాండ్‌ శ్రీనివాస్ యాదవ్ TDPలో చేరడం కొసమెరుపు.

News December 13, 2025

బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఫలితాల వెల్లడిలో మార్పులు

image

బ్యాంక్ ఉద్యోగాల నియామకాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. SBI, నేషనల్ బ్యాంకులు, RRB (Regional Rural Banks)ల పరీక్షా ఫలితాల ప్రకటన క్రమాన్ని మార్చింది. ఇకపై ముందుగా SBI, ఆ తర్వాత నేషనల్ బ్యాంకులు, చివరగా RRBల ఫలితాలను విడుదల చేస్తారు. అదే విధంగా ముందుగా PO (Probationary Officer) రిజల్ట్స్ తరువాత క్లరికల్‌వి ప్రకటించనున్నారు. దీనివల్ల అభ్యర్థులు మంచి ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.