News April 23, 2025
NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కార్మికులు చిక్కుకొని నేటికీ 60 రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు చేపట్టిన సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 12 కంపెనీలకు చెందిన 700మంది సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ అందులో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ నేటికీ లభించలేదు. ఈనెల 24న సహాయక చర్యలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 24, 2025
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: రామ్మోహన్

కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ ఎయిర్పోర్టులో ఎంతో బాధతో స్వీకరించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులు అర్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామన్నారు.
News April 24, 2025
బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
News April 24, 2025
భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.