News April 13, 2025

NGKL: BRS, BJP నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: మల్లు రవి

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో లేనిది ఉన్నట్లు కల్పితాలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి విమర్శించారు. దిల్లీలో శనివారం మీడియా సమావేశంలో ఆయన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన విషయం నిజం కాదంటూ ప్రశ్నించారు.

Similar News

News October 25, 2025

ఫ్లవర్‌వాజ్‌లో పూలు తాజాగా ఉండాలంటే..

image

ఫ్లవర్ వాజ్‌లో ప్లాస్టిక్ పువ్వులకు బదులు రియల్ పువ్వులను పెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇవి త్వరగా వాడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పువ్వులను ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేటప్పుడు వాటి కాడలను కొంచెం కట్ చేయాలి. అలాగే ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. ఇందులో కాపర్ కాయిన్/పంచదార/ వెనిగర్ వేస్తే పువ్వులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్లవర్‌వాజ్‌ను నేరుగా ఎండ తగిలే ప్లేస్‌లో ఉంచకూడదు.

News October 25, 2025

బిహార్‌లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

image

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

News October 25, 2025

ఏటూరునాగారం: నడుములోతు వాగు.. వృద్ధురాలి అవస్థ..!

image

ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. గత 4 నెలలుగా ముంపు గ్రామాల ప్రజల అవస్థలు వర్ణాతీతం. ఇందులో భాగంగా ఏటూరునాగారంలో జరుగుతున్న ఓ ఉచిత కంటి శిబిరానికి వెళ్లేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు నరకయాతన పడింది. నడుములోతు వాగులో దాటి యువకుల సహాయంతో ఒడ్డుకు చేరింది. వాగు తగ్గుముఖం పట్టకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు.