News April 22, 2025

NGKL: BRS వాళ్లు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే

image

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వంపై BRS వాళ్లు విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి హితవు పలికారు. NGKL వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొని ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు పాల్గొన్నారు.

Similar News

News April 23, 2025

ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

image

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.

News April 23, 2025

శ్రీరాంపూర్: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు

image

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. అర్హత కలిగిన ఉద్యోగుల ఉన్నత చదువుకు ఇప్పటి వరకు యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహక నగదు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివిధ పోటీ పరీక్షల్లో 2 వేలలోపు ర్యాంకు సాధించిన 57 మందికి అందిస్తున్న రూ.10 వేలు మెరిట్ స్కాలర్ షిప్‌ను రూ.16 వేలకు పెంచింది. అలాగే ర్యాంక్ పరిమితి 2 వేలు లోపు నుంచి 8 వేలకు అవకాశం కల్పించారు.

News April 23, 2025

పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

image

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరిం‌త పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం‌ నియామక‌పత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని‌ సూచించారు.

error: Content is protected !!