News March 4, 2025
NGKL: HYDలో శిరీషను చంపి డ్రామా!

HYDలో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. NGKL దోమలపెంటకు చెందిన వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. HYD మలక్పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News September 19, 2025
రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.
News September 19, 2025
NZB: 250కిపైగా పిల్లలున్నా.. లేని ప్రభుత్వ టీచర్..!

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్లోని MPPS ఉర్దూ మీడియం HM అఫ్సర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఆయన్ను గురువారం మాజీ MPTC గౌస్, స్కూల్ సిబ్బంది, గ్రామస్థులు సన్మానించారు. అయితే ఈ స్కూల్లో 250కిపైగా విద్యార్థులున్నా వీరికి గణితం, తెలుగు బోధించేందుకు టీచరే లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పిలలకు నష్టం జరగకుండా గౌస్ 2024 నుంచి నెలకు రూ.3,000 జీతం ఇస్తూ ఓ మహిళా టీచర్తో చదువు చెప్పిస్తున్నారు.
News September 19, 2025
అనంతపురం GGHలో జూ.డాక్టర్పై అత్యాచారయత్నం?

అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్పై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగుడు మూడు రోజుల క్రితం రాత్రి ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆమెను గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. డాక్టర్ కేకలతో రోగుల బంధువులు స్పందించి దుండగుడికి దేహశుద్ధి చేశారు. బాధితురాలు ఈ విషయాన్ని ఆర్ఎమ్వో హేమలతకు తెలియజేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.