News March 21, 2025
NGKL: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. బిజినేపల్లి మం. సల్కర్పేటకు చెందిన శ్రీనివాసులు(55) బైక్పై సొంతూరుకి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను HYDలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 31, 2025
భూపాలపల్లి : నిరుద్యోగ యువత ఆందోళన.. !

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు. ఈ పథకం ప్రయోజనాలు గ్రామీణ కార్యకర్తలకు చేరకుండా, అర్హత కలిగిన నిరుద్యోగులకు అధికారుల ద్వారా అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుద్యోగ యువతకు అందించే గొప్ప అవకాశమని వారు అభిప్రాయపడ్డారు.
News March 31, 2025
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
News March 31, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.