News April 14, 2025

NGKL: డీఎస్పీ నుంచి బీఎస్పీలోకి చేరికలు

image

BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మిద్దె శివప్రసాద్ (నాగర్ కర్నూల్), పంజుగుల శంకర్ (కల్వకుర్తి), మల్లెపాకుల సైదులు (అచ్చంపేట) ధర్మ సమాజ్ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో సోమవారం చేరారు. మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానందరావు, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అంతటి నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2025

తెలంగాణలో కొత్తూరు వాసి ఆకస్మిక మృతి

image

కొత్తూరు మండలానికి చెందిన కూన చిరంజీవులు(57) తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురం ఏరియా డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న తర్వాత స్నేహితులతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన భోజనం ముగించుకుని సేద తీరేందుకు కుర్చీలో కూర్చుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం(M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!