News February 2, 2025

NGKL: తరగతి గదిలో చరవాణిలను వినియోగిస్తే చర్యలు: డీఈఓ

image

నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈఓ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉపాధ్యాయుల సెల్ ఫోన్లను అయన సీజ్ చేశారు. శనివారం మండల పరిధిలోని గద్దలపల్లి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయకుండా సెల్ఫోన్లను వినియోగిస్తున్న అంశాన్ని డీఈవో గుర్తించి, ఇద్దరు ఉపాధ్యాయులపై డిఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 13, 2025

పెద్దపల్లి: 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ జరగాలి: సీఈఓ

image

తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, RDO గంగయ్య జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. మార్చి 19 లోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలన్నారు.

News March 13, 2025

హిందూపురం: ‘మహిళలు ప్రగతి బాటలో పయనించాలి’ 

image

మహిళలు సమస్యలపై అవగాహన పెంచుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి హారిక పేర్కొన్నారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హిందూపురం పరిధిలోని డీసీ కన్వెన్షన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలకు భద్రతపరంగా పోలీసు శాఖ ఎప్పుడూ సహకారం అందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. చట్టాలు ఎన్నో మహిళలకు అనుకూలంగా ఉన్నాయన్నారు.

News March 13, 2025

PPM: ‘మార్చి 23 నాటికి గృహ నిర్మాణాల సర్వే పూర్తి చేయాలి’

image

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను మార్చి 23 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేజ్ అప్ గ్రేడ్ విధిగా జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇనుము ధర తగ్గిందని, ఇసుక లభ్యంగా ఉందన్నారు. ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగాయని అన్నారు.

error: Content is protected !!