News March 22, 2025

NGKL: పెద్దకొత్తపల్లి లో38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా లో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా పెద్దకొత్తపల్లి లో 38.8 ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దూర్ 38.7, అచ్చంపేట,వంగూరు38.6, కొల్లాపూర్38.4, ఉప్పునుంతల38.3, బిజినపల్లి 38.1, కల్వకుర్తి,చారకొండ38.0, బల్మూర్37.8 తెలకపల్లి,పెంట్లవెల్లి37.5,నాగర్ కర్నూల్37.0 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 25, 2025

అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?

image

అల్యూమినియం పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అల్యూమినియం ఆహారం, నీటిలో సహజంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల న్యూరో టాక్సిక్ ప్రభావాలను కలిగించవచ్చు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. అధిక వేడి వద్ద ఇది ఆహారంలో కలవొచ్చు. ఈ అధిక అల్యూమినియం ఎముకలు, లివర్, కిడ్నీలను ప్రభావితం చేయొచ్చు. అందుకే స్టీల్, కాస్ట్ ఐరన్ పాత్రలను వాడితే బెటర్’ అని తెలిపారు.

News March 25, 2025

Stock Markets: ఎగిసి ‘పడ్డ’ నిఫ్టీ, సెన్సెక్స్

image

ఉదయం భారీగా లాభపడ్డ బెంచ్‌మార్క్ సూచీలు చివరికి ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 78,017 (32), నిఫ్టీ 23,668 (10) వద్ద స్థిరపడ్డాయి. సూచీలు రెసిస్టెన్సీ వద్దకు చేరడం, ట్రంప్ టారిఫ్స్ ప్రకటనే ఇందుకు కారణాలు. ఐటీ షేర్లు ఎగిశాయి. వినియోగం, PSU బ్యాంకు, మీడియా, రియాల్టి, మెటల్, ఎనర్జీ, చమురు, PSE, ఫార్మా, ఆటో, కమోడిటీస్ షేర్లు ఎరుపెక్కాయి. అల్ట్రాటెక్, ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.

News March 25, 2025

కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

image

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.

error: Content is protected !!