News March 24, 2025

NGKL: ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 10,537 మంది హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసే విధానాన్ని పరిశీలించారు. డీఈఓ చీఫ్ సూపరింటెండెంట్‌లకు పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేందుకు సూచనలు ఇచ్చారు.

Similar News

News March 29, 2025

జూలూరుపాడులో పర్యటించిన అ.కలెక్టర్ విద్యాలత

image

జూలూరుపాడు మండలంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాలత పర్యటించారు. పలు గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

News March 29, 2025

సంగారెడ్డి: యుద్ధ ట్యాంకర్ల తయారీకి ఒప్పందం

image

దేశ రక్షణలో ఎంత ఉపయోగపడే యుద్ధ ట్యాంకర్ల తయారీకి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆయుధ కర్మాగారంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. మిస్సెల్ పేరిట 293 యుద్ధ ట్యాంకర్లు, నామిస్ పేరుతో 13 అత్యాధునిక ట్యాంకర్ల తయారీకి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటిపై కేంద్ర రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్, ఓడిఎఫ్ సంస్థ చీఫ్ జీఎం శివశంకర ప్రసాద్ సంతకాలు చేశారు.

News March 29, 2025

పి -ఫోర్ కు జిల్లా నుంచి 500 మంది లబ్ధిదారులు: కలెక్టర్

image

అమరావతిలో ఉగాది రోజున నిర్వహించే ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్య పథకమైన పి -ఫోర్ కార్యక్రమం పై కలెక్టర్ పి. అరుణ్ బాబు శనివారం సమీక్షించారు. శూన్య పేదరికం లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 14 బస్సులలో 500 మంది లబ్ధిదారులు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!