News February 27, 2025
NGKL: మార్చి 2న వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి మార్చి 2న వనపర్తికి రానున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో జరిగే ఉద్యోగ మేళాకు అతిథిగా సీఎం రానున్నారని మల్లు రవి తెలిపారు.
Similar News
News February 27, 2025
మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు ఉదయం అభిషేకంతో ప్రారంభమై, వీరభద్ర పల్లెరము, భద్రకాళి పూజ, నిత్య పూజలు జరగనున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాలలో నడుచుట కార్యక్రమాలతో రెండో రోజు కార్యక్రమాలు ముగియనున్నాయి. రెండవ రోజు భక్తుల సౌకర్యార్థము ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.
News February 27, 2025
BIG ALERT: ఉ.11 తర్వాత బయటికి వెళ్లొద్దు

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.
News February 27, 2025
వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

✓ పూడూరు: నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం.✓ దుద్యాల: నేడు పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకోనున్న పాలమూరు ఎంపీ డీకే అరుణ.✓ కొడంగల్: నేడు గాడిబాయి శివాలయంలో అన్నదాన కార్యక్రమం.✓ తాండూర్: నేడు భూకైలాస్లో పల్లకిసేవ, నేడు ఆయ నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్పీకర్.✓ పరిగి: నేడు బ్రహ్మసూత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.