News October 26, 2024
మూగజీవాల కోసం ఎన్జీవో: రేణూదేశాయ్

మూగ జీవాల రక్షణ కోసం సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించినట్లు రేణూదేశాయ్ తెలిపారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు ముందుకు రావాలని వీడియోలో వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్స్టాలో తన ఫాలోవర్స్తో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిన్నతనం నుంచి మూగజీవాల సంరక్షణ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ క్రమంలో వాటి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎన్జీవోను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
ట్యాపింగ్ కేసు.. ఇంకెంతకాలం విచారిస్తారు: సుప్రీం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్ను ప్రశ్నించింది.
News January 16, 2026
ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన BJP కూటమి

BMC ఎన్నికల కౌంటింగ్లో BJP+ దూసుకుపోతోంది. ఏక్నాథ్ షిండే శివసేనతో కూడిన కూటమి మెజారిటీ మార్కును (114) దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 115 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి 77 వార్డుల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక తమ కంచుకోట పుణే, పింప్రి చించ్వివాడ్లో ‘పవార్’ల పట్టు సడలినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా BJP హవానే కొనసాగుతోంది.
News January 16, 2026
ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.


