News October 13, 2024

సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA దర్యాప్తు

image

చెన్నై శివారులో భాగ‌మ‌తి ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ అనుమానాలపై NIA విచార‌ణ ప్రారంభించింది. మెయిన్ లైన్‌లో ఉండాల్సిందిగా సిగ్న‌ల్ ఇచ్చినా రైలు లూప్‌లైన్‌లోకి ప్ర‌వేశించ‌డం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో సిగ్న‌ల్ ట్యాంప‌రింగ్ జ‌రిగిందా? లేదా కుట్ర కోణం ఉందా? అన్న విష‌యంలో ద‌ర్యాప్తు జరుగుతోంది. కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

Similar News

News September 16, 2025

వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

image

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.

News September 16, 2025

OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

image

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్‌ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.

News September 16, 2025

విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్‌చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.