News September 28, 2024
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించారు. ఈ ఏడాది పూరన్ 2,059 పరుగులు చేశారు. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(2036 రన్స్-2021)ను ఆయన అధిగమించారు. వీరిద్దరి తర్వాత అలెక్స్ హేల్స్ (1946 రన్స్-2022), జోస్ బట్లర్ (1833 రన్స్-2023) ఉన్నారు. 2022లోనూ మహ్మద్ రిజ్వాన్ (1817 రన్స్) అత్యధిక పరుగులు చేశారు.
Similar News
News September 28, 2024
తదుపరి హెజ్బొల్లా చీఫ్ సఫీద్దీన్?
హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా మృతితో అతని వారసుడిగా హషేమ్ సఫీద్దీన్ నియమితులయ్యే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది. నస్రుల్లా బంధువైన సఫీద్దీన్ ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలను, సైనిక చర్యలను పర్యవేక్షించే జిహాద్ కౌన్సిల్లో చురుగ్గా ఉన్నాడు. 2017లో US ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. హెజ్బొల్లా కీలక నేతల మృతిపై ప్రతీకారం తప్పదని గతంలోనే సఫీద్దీన్ హెచ్చరించాడు.
News September 28, 2024
మీకు తెలుసా? 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు!
1908లో ఇదే రోజు (సెప్టెంబర్ 28) మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్లో 15,000 మంది మరణించారు. కొన్ని గంటల్లోనే 48 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో మూసీ ఉప్పొంగింది. వందల చెరువుల కట్టలు తెగి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు నగరంలో ప్రవహించింది. అయితే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని చింత చెట్టును ఎక్కి 150 మంది ప్రాణాలను కాపాడుకున్నారు. 2 రోజులు దానిపైనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆ చెట్టు బతికే ఉంది.
News September 28, 2024
MLA కొలికపూడిపై CMకు ఫిర్యాదు
AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని వారు సీఎంకు తెలిపారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.