News March 31, 2025
మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

PM మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా IFS అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్(UP)కు చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో PMOలో అండర్ సెకట్రరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే PMOలో కీలక స్థాయికి వచ్చారు.
Similar News
News April 2, 2025
చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు?

చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక చలాన్ను 3 నెలలలోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు చలాన్లు పడినవారి లైసెన్స్ను కనీసం 3 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం.
News April 2, 2025
రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.
News April 2, 2025
IPL: హ్యాట్రిక్పై కన్నేసిన RCB

ఐపీఎల్లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.