News September 27, 2024
IT షేర్ల అండతో నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డ్స్

INFY, TCS సహా ఐటీషేర్ల అండతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ తొలిసారి 26,271 స్థాయిని టచ్ చేసింది. ప్రస్తుతం 50 పాయింట్ల లాభంతో 26,265 వద్ద కొనసాగుతోంది. 85,966 వద్ద రికార్డు సృష్టించిన BSE సెన్సెక్స్ 100 పాయింట్లు ఎగిసి 85,923 వద్ద ట్రేడవుతోంది. హిందాల్కో, టైటాన్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇన్ఫీ టాప్ గెయినర్స్. LT, పవర్ గ్రిడ్, ఎయిర్టెల్, దివిస్ టాప్ లూజర్స్.
Similar News
News November 7, 2025
మరోసారి ‘నో హ్యాండ్ షేక్’!

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్’ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్లో, మహిళల ప్రపంచ కప్లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇవాళ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలోనూ ఇది రిపీట్ అయింది. ఇండియా మ్యాచ్ <<18225529>>గెలిచిన <<>>కొన్నిక్షణాలకే ప్రసారం ముగిసింది. ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. రెండు టీమ్స్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే ఉండిపోయాయని సమాచారం.
News November 7, 2025
స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>
News November 7, 2025
అది పాకిస్థాన్ చరిత్రలోనే ఉంది: భారత్

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.


