News December 17, 2024
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు

APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.
Similar News
News January 21, 2026
కేంద్రప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే ACB కేసు పెట్టొచ్చు: SC

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే CBI ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్ర పోలీసులు కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని Sec-17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీసు ఏజెన్సీ అయినా కేసు పెట్టొచ్చంది. అవినీతికి పాల్పడ్డ కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్ ACB కేసుపెట్టడాన్ని అక్కడి హైకోర్టు సమర్థించగా సుప్రీంకోర్టు సైతం ఏకీభవించింది.
News January 21, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

నిబంధనలను ఉల్లంఘించి పురుగు మందులను తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా నేరం. వీటి విక్రయాల వల్ల ఎవరైనా మరణించినా లేదా గాయపడినా తయారీదారులను బాధ్యులను చేస్తూ ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తొలిసారి నేరానికి రూ.10లక్షలు- రూ.50 లక్షలు, రెండోసారి అదే తప్పు చేస్తే, గతంలో విధించిన జరిమానా కంటే రెట్టింపు వసూలు చేస్తారు. రిపీటైతే లైసెన్స్ రద్దు, ఆస్తులను జప్తు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది.
News January 21, 2026
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. అంతా ఉత్తిదే!

సోషల్ మీడియాలో RGF(రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ) తెగ వైరలవుతోంది. ఓ యూట్యూబర్ చేసిన తుంటరి పని దీనికి కారణమని సమాచారం. హీరో రాజశేఖర్ను ఓనర్గా పేర్కొంటూ ఓ వీడియో చేయగా ఫేక్ అపాయింట్మెంట్స్, ఐడీ కార్డ్స్, శాలరీలు అంటూ పోస్టులు పుట్టుకొచ్చాయి. ఇందులో ఏదీ నిజం కాదని, ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. యూట్యూబ్లో వచ్చే ఇలాంటి వీడియోలను గుడ్డిగా నమ్మొద్దని పలువురు సూచిస్తున్నారు.


