News September 3, 2024
ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రివేళ పెట్రోలింగ్: మంత్రి ఆదేశం

TG: మహిళా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రి సమయాల్లో షీ టీమ్లతో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. అన్ని బోధనాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన పోలీసు అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై మంత్రి సమీక్షించారు.
Similar News
News January 20, 2026
72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 20, 2026
అడవులు ఖాళీ.. ఇక దోమల టార్గెట్ మనుషులే!

అడవులు తగ్గిపోతుండటంతో దోమలు ఇప్పుడు జంతువులకు బదులుగా మనుషుల రక్తం తాగడానికి ఇష్టపడుతున్నాయని బ్రెజిల్లో జరిగిన స్టడీలో తేలింది. అడవులు అంతరించిపోవడం వల్ల జంతువులు దూరమై దోమలకు వేరే ఆప్షన్ లేక మనుషులపై పడుతున్నాయట. 1,700 దోమలపై జరిపిన ఈ అధ్యయనంలో అవి మనుషుల రక్తానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిసింది. దీనివల్ల ఫ్యూచర్లో కొత్త రకమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
News January 20, 2026
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

TG: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్ ఫస్టియర్తో పాటు 6,7,8 బ్యాక్లాగ్ ఖాళీలకు FEB 28 వరకు <


