News September 1, 2025

NIMSలో పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

image

నేటి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌లో చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఈ శిబిరం సెప్టెంబర్ 21 వరకు జరగనుంది. మంగళ, గురు, శుక్రవారాలలో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఆస్పత్రిలో సంప్రదించవచ్చు. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారు.
SHARE IT

Similar News

News September 1, 2025

HYD: రూ.2 కోట్లతో స్వీపింగ్ కోసం టెండర్!

image

స్వీపింగ్ మిషన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేసిన GHMC, అద్దె యంత్రాల కోసం మళ్లీ టెండర్లును పిలిచి నవ్వుల పాలవుతుంది. ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్ జోన్ ప్రాంతాల్లో స్విపింగ్ కోసం దాదాపు రూ.2 కోట్లు చెల్లించేందుకు టెండర్లను పిలిచారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరు, తీసుకునే చర్యలపై స్థానిక జోన్ ప్రాంతాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News September 1, 2025

HYD: గణపతి నిమజ్జనాలకు ఈ ప్రాంతాల్లో RTA వాహనాలు

image

నిమజ్జనాల కోసం RTA వాహనాలు అందించేందుకు సిద్ధమైంది. HYD వ్యాప్తంగా 12వాహన కేంద్రాలను నిమజ్జనాల కోసం గుర్తించింది. ఈ కేంద్రాల నుంచి మండపాలకు వాహనాలు తీసుకెళ్లొచ్చు. నెక్లెస్ రోడ్డు, మేడ్చల్, టోలిచౌకి, జూ పార్క్, మలక్‌పేట, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్‌చేరు, వనస్థలిపురం, ఆటోనగర్ RTA కేంద్రాల నుంచి వాహనాలను మండపాలకు తరలించునున్నారు.

News August 31, 2025

మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

image

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.