News June 7, 2024
ఏపీ సీఎస్గా నీరభ్ కుమార్?
AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు <<13390605>>తెరపైకి<<>> వచ్చింది. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబును నీరభ్ కుమార్ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఆయన నియామకంపై ఇవాళ జీవో రావొచ్చనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత CS జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
Similar News
News October 30, 2024
PBKS సంచలన నిర్ణయం: అర్ష్దీప్ రిలీజ్?
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్దీప్ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.
News October 30, 2024
రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
News October 30, 2024
మందుబాబులకు మరో గుడ్న్యూస్!
AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లోకి త్వరలోనే మరిన్ని కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం తక్కువ ధరకే క్వాలిటీ మద్యం అందిస్తున్నామని, ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఓ కమిటీ వేశామని, నివేదిక రాగానే రేట్లు తగ్గిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని కొల్లు స్పష్టం చేశారు.