News June 7, 2024

ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా <<13394190>>నీరభ్ కుమార్ <<>>ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావ‌ర‌ణ‌, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Similar News

News November 27, 2025

RECORD: వికెట్ కోల్పోకుండా 177 రన్స్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. ఒడిశాతో మ్యాచులో వికెట్ కోల్పోకుండా 177 రన్స్ చేశారు. రోహన్ 60 బంతుల్లో 10 సిక్సులు, 10 ఫోర్లతో 121*, సంజూ 41 బంతుల్లో 51* పరుగులు బాదారు. ఈ టోర్నీ హిస్టరీలో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. ఈ మ్యాచులో తొలుత ఒడిశా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా, కేరళ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

News November 27, 2025

ఫైబర్ ఎంత తీసుకోవాలంటే..

image

మన శరీరానికి పీచు తగిన మొత్తంలో అందితేనే ఆకలి, ట్రైగ్లిజరాయిడ్స్‌ అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువ. దంపుడు బియ్యం, గోధుమ, జొన్న, సజ్జ రవ్వలు, ఓట్స్, రాజ్మా, శనగల నుంచి ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజులో 25-48గ్రా. వరకూ పీచు కావాలి. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.

News November 27, 2025

ముంపును తట్టుకొని అధిక దిగుబడి అందించిన వరి రకాలు

image

ఇటీవల మెుంథా తుఫానుకు వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. కానీ ఈ తీవ్ర తుఫాన్‌ను ఎదుర్కొని మంచి దిగుబడినిచ్చాయి R.G.L- 7034, M.T.U-1232 వరి రకాలు. తీవ్ర గాలులు, వరద ముంపు, అనంతర చీడపీడలను తట్టుకొని ఈ 2 వరి రకాలు ఆశించిన దిగుబడినిచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తక్కువ ఎరువుల మోతాదుతో అధిక దిగుబడినిచ్చే ఈ వరి వంగడాల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.