News June 7, 2024
ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా <<13394190>>నీరభ్ కుమార్ <<>>ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Similar News
News December 11, 2025
మహిళల్లో త్వరగా వృద్ధాప్యం రావడానికి కారణమిదే!

మహిళల్లో జీవ సంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేయడంలో గర్భధారణ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ మెయిల్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో స్త్రీలలో జీవశాస్త్రపరంగా గర్భం దాల్చిన స్త్రీలు.. గర్భం దాల్చని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని గుర్తించారు. పురుషులలో ఇలాంటి జీవసంబంధమైన వృద్ధాప్యం వంటివి లేవని ఈ అధ్యయనం తెలిపింది.
News December 11, 2025
రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ 26 జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువనైల్ జస్టిస్ బోర్డులో ఖాళీగా ఉన్న 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని అనుభవం గల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 11, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు.. 4 రోజులే గడువు

AP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఈ నెల 15 వరకే గడువు ఉంది. ఆ తర్వాత మిలిగిన కార్డులను కమిషనరేట్కు పంపుతారు. అప్పటికీ తీసుకోనివాళ్లు సచివాలయాల్లో రూ.200 చెల్లించి, పూర్తి అడ్రస్తో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


