News June 7, 2024
ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా <<13394190>>నీరభ్ కుమార్ <<>>ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Similar News
News December 19, 2025
పోలవరం పెండింగ్ అనుమతులివ్వండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్ను CM చంద్రబాబు కోరారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్తో గంటపాటు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అనుమతులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని చూస్తోందని, భూసేకరణకు సిద్ధమైందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.
News December 19, 2025
జంట పేలుళ్ల దోషుల శిక్ష రద్దు పిటిషన్పై HC విచారణ

TG: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల దోషులకు HC ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. ఆరోగ్య, మానసిక స్థితి, పశ్చాత్తాప భావనను పరిగణించి మరణశిక్ష రద్దు చేయాలని నేరస్థులు పిటిషన్ వేశారు. తమ విచారణను మరో బెంచ్కు మార్చాలని కోరారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. 2007లో HYD జంట పేలుళ్లతో 46మంది చనిపోయారు. ఈ కేసులో MHకు చెందిన అనిక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్లకు 2018లో ఉరిశిక్ష పడింది.
News December 19, 2025
స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని వినతి!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే స్నానం చేసి స్కూల్కు వెళ్లే క్రమంలో చలిగాలులకు అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో అల్లాడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ <<18607575>>స్కూళ్ల టైమింగ్స్<<>> మార్చారు. ఇదే తరహాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో అన్ని పాఠశాల సమయాలను మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?


