News June 7, 2024
AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News December 11, 2025
రైతులకు గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లోకి డబ్బులు

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాలను రేపట్నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 55,904 మంది రైతుల అకౌంట్లలో ₹585 కోట్లు జమ అవుతాయన్నారు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు చెప్పారు. కేంద్రం సహకరించకున్నా రైతులు నష్టపోరాదని తామే సేకరిస్తున్నట్లు వివరించారు. రైతుల శ్రేయస్సే తమ తొలి ప్రాధాన్యమన్నారు.
News December 11, 2025
ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు.. ప్రకటించిన CEC

బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు CEC నజీర్ ఉద్దీన్ ఇవాళ ప్రకటించారు. ‘డిసెంబర్ 29న నామినేషన్లు, జనవరి 22 నుంచి పోలింగ్కు 48గంటల ముందు వరకు ప్రచారానికి అవకాశం ఉంటుంది. 300 పార్లమెంటరీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ రోజే ‘జులై చార్టర్’పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పోలింగ్ నిర్వహిస్తాం’ అని మీడియాకు తెలిపారు.
News December 11, 2025
తడబడుతున్న భారత్

SAతో జరుగుతున్న రెండో T20లో పరిస్థితులు భారత్కు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో IND తడబడుతోంది. 32 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో 4 రన్స్ చేసిన వైస్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్ అయ్యారు. దూకుడుగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ(17) ఔటవ్వగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5) మరోసారి నిరాశ పరిచారు. SA బౌలింగ్లో జాన్సెన్ 2, ఎంగిడి ఒక వికెట్ తీశారు.


