News June 7, 2024

AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

image

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News December 11, 2025

జాగ్రత్తగా ఓటేయండి.. గ్రామాల పురోగతికి పాటుపడండి!

image

TG: గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడంలో సర్పంచ్‌లదే కీలకపాత్ర. నోటు, క్వార్టర్‌, బిర్యానీకి ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లూ ఇబ్బందిపడాల్సిందే. కులం, బంధుత్వాలు, పార్టీలు చూసి అసమర్థుడికి ఓటేస్తే అధోగతే. అందుకే 24/7 అందుబాటులో ఉండే, సమస్యలపై స్పందించే నాయకుడిని ఎన్నుకోవాలి. ఇందులో యువత పాత్ర కీలకం. సమర్థుడికి <<18527601>>ఓటేసి<<>>, కుటుంబీకులతోనూ ఓట్లేయించి గ్రామాల పురోగతికి పాటుపడండి.

News December 11, 2025

భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత వాతావరణ శాఖ(<>IMD<<>>)లో 134 ప్రాజెక్ట్ సైంటిస్ట్ , సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 14వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి MSc, BE, B.Tech, PhD, ME, M.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mausam.imd.gov.in/

News December 11, 2025

సెకండరీ డిస్‌మెనోరియాని ఎలా గుర్తించాలంటే?

image

ప్రైమరీ డిస్‌మెనోరియా అంటే రజస్వల అయినప్పటి నుంచి పీరియడ్స్ రెండు రోజుల్లోనే నొప్పి ఉంటుంది. కానీ సెకండరీ డిస్‌మెనోరియాలో నెలసరికి ముందు, తర్వాత కూడా తీవ్రంగా నొప్పి వస్తుంది. దీంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి, బ్లీడింగ్‌లో మార్పులు ఉంటాయి. కాబట్టి సెకండరీ డిస్‌మెనోరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.