News June 7, 2024
AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
విష్ణుమూర్తి ఎక్కడెక్కడ ఉన్నాడంటే?

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః|
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||
విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. సమస్తం తెలిసిన ఆయన సూర్య కిరణాల రూపంలో మనకు వెలుగు పంచుతూ ఉన్నాడు. ఈ విశ్వంలో అన్ని సేనలకు నాయకుడై, కాల రూపుడై అందరినీ తనలో లీనం చేసుకుంటున్నాడు. వేదాలు, వేద జ్ఞానం కూడా ఆయనే. వేదాంగాలకు అధిపతి, వేదాల పరమార్థాన్ని తెలుసుకున్న ఆ మహాకవిని నమస్కరించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 10, 2025
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.
News December 10, 2025
RBIలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

RBI 5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్సైట్: rbi.org.in.


