News June 7, 2024

AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

image

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News December 11, 2025

పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర కావాల్సిందే..

image

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.

News December 11, 2025

పరిధి దాటారు, రేపు లొంగిపోండి: సుప్రీంకోర్టు

image

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ACP వెంకటగిరి ఎదుట 11AM లోపు లొంగిపోవాలని పేర్కొంది. SIB చీఫ్‌గా తన పరిధి దాటి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అటు బెయిల్ రద్దుతో పాటు, 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది.

News December 11, 2025

కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న BCCI

image

వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Aనుంచి A+కు ప్రమోట్ కానున్నారు. అంపైర్స్, రిఫరీల రెమ్యునరేషన్ అంశాలపైనా ఇందులో చర్చ జరగనుంది. ప్లేయర్లకు A+, A, B, C కేటగిరీలుగా బోర్డు శాలరీలు ఇస్తోంది.
A+: ₹7కోట్లు, A: ₹5కోట్లు, B: ₹3కోట్లు, C: ₹1కోటి.