News June 7, 2024
AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
శబరిమల భక్తులకు అలర్ట్

శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. నదిలో మునిగేటప్పుడు ముక్కు మూసుకోవాలని సూచించారు.


