News August 17, 2024

మ‌మ‌తపై నిర్భ‌య త‌ల్లి ఆగ్ర‌హం

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం ఘ‌ట‌న‌లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘటన నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. మమతా ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవి కోరారు.

Similar News

News October 28, 2025

నేర నియంత్రణలో సాంకేతికత కీలకం: ఖమ్మం సీపీ

image

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆన్‌లైన్ “ఓపెన్ హౌస్” మంగళవారం నిర్వహించారు. పోలీసులు వినియోగించే ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఫింగర్‌ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు విద్యార్థులకు చూపించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీపీ మాట్లాడుతూ.. సాంకేతికతతోనే నేర నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

News October 28, 2025

2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.

News October 28, 2025

తుఫాను ప్రభావం.. భీకర గాలులు

image

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.