News August 17, 2024

మ‌మ‌తపై నిర్భ‌య త‌ల్లి ఆగ్ర‌హం

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం ఘ‌ట‌న‌లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘటన నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. మమతా ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవి కోరారు.

Similar News

News February 6, 2026

చౌడు నేలల్లో పంటలకు యూరియా ఇలా వేస్తే మేలు

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.

News February 6, 2026

అవకాశం వచ్చినప్పుడు గెలిచి తీరాల్సిందే: సీఎం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు.

News February 6, 2026

బంగ్లాలో ఘర్షణలు.. యూనస్ ఇంటి బయటే..!

image

ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.