News January 31, 2025
8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావడం విశేషం. స్వతంత్ర భారత్లో మొదటి బడ్జెట్ను Nov 26, 1947న తొలి ఆర్థిక మంత్రి RK షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ కాలంలో MP James Wilson మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Similar News
News March 28, 2026
ఆయిల్ పామ్ సాగు.. అబ్లేషన్ వల్ల లాభమేంటి?

ఆయిల్ పామ్ సాగులో మొక్క నాటిన 14 నుంచి 18 నెలల తర్వాత పుష్పిస్తుంది. ఈ పూలగుత్తులు లేతదశలో ఉన్నప్పుడు అబ్లేషన్ సాధనం ఉపయోగించి తుంచి వేయాలి. దీని వల్ల వేరువ్యవస్థ బాగా అభివృద్ధిచెంది నీరు మరియు పోషకాలను గ్రహించి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. మొక్క 30 నెలల వయసు వరకు అబ్లేషన్ విధానంలో పూగుత్తులను తొలగించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 28, 2026
NLC ఇండియా లిమిటెడ్లో 16 పోస్టులు.. అప్లై చేశారా?

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ 16 హెల్త్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్స్పెక్టర్)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.
News March 28, 2026
రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త

ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైస్ను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం FCI వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండటంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. వాటిని ఖాళీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


