News May 19, 2024
మెట్రోలో నిర్మలా సీతారామన్కు చేదు అనుభవం?

ఢిల్లీ మెట్రో రైలులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణిస్తున్నంతసేపు ప్రయాణికులెవరూ ఆమె కూర్చునేందుకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆమె నిల్చునే ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మంత్రికి కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమాజం ఎటు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 4, 2025
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
News November 4, 2025
విశాఖలో భూప్రకంపనలు

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.
News November 4, 2025
రబ్బర్ బోర్డ్లో 51 పోస్టులకు నోటిఫికేషన్

<


