News May 19, 2024
మెట్రోలో నిర్మలా సీతారామన్కు చేదు అనుభవం?

ఢిల్లీ మెట్రో రైలులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణిస్తున్నంతసేపు ప్రయాణికులెవరూ ఆమె కూర్చునేందుకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆమె నిల్చునే ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మంత్రికి కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమాజం ఎటు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
ప్రమాణస్వీకారానికి రండి.. మోదీకి బంగ్లా ఆహ్వానం!

బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఈ నెల 17న కొలువుదీరనుంది. ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. మరో 12 దేశాలకు ఇన్విటేషన్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అతికొద్ది మందిని క్యాబినెట్లోకి తీసుకోనున్నారని, తర్వాత విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎన్నికల్లో 297 స్థానాలకు గాను 209 చోట్ల BNP గెలిచింది.
News February 15, 2026
శివ నామాలు అర్థాలు ‘‘దక్షిణామూర్తి’’

శివుడు కేవలం లయకారుడే కాదు, సకల విద్యాప్రదాత కూడా. మౌనంగా ఉంటూనే తన ముద్రల ద్వారా పరమ సత్యాన్ని బోధించే ఆదిగురువు ఈయన. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని సనకాది మునులకు జ్ఞానాన్ని ఉపదేశించారు కాబట్టి ఈయనకు ‘దక్షిణామూర్తి’ అనే పేరు వచ్చింది. మేధస్సు, జ్ఞానం, సంగీతం, యోగం వంటి కళలన్నింటికీ ఈయనే మూలపురుషుడు. విద్యార్థులు, జ్ఞానాన్వేషకులు ఈయనను ధ్యానించడం వల్ల అత్యున్నతమైన బుద్ధిని పొందుతారు.
News February 15, 2026
మొన్న డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్పై చైనా నిషేధం!

వాహన భద్రతా ప్రమాణాలను చైనా కఠినతరం చేసింది. ఇటీవల ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ను బ్యాన్ చేయగా, తాజాగా హాఫ్ స్టీరింగ్ వీల్స్ను నిషేధించింది. 2027 Jan 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ప్రమాదాల్లో డ్రైవర్లకు తగిలే గాయాల్లో 46% స్టీరింగ్ వ్యవస్థ కారణమవుతోంది. హాఫ్ స్టీరింగ్ వల్ల తీవ్రత పెరుగుతోంది. యాక్సిడెంట్లలో ఫ్లష్ హ్యాండిల్స్ తెరుచుకోని ఘటనలు ఎక్కువయ్యాయి. దీంతోనే వాటిని బ్యాన్ చేసింది.


