News April 3, 2025

మరో వివాదంలో నిత్యానంద!

image

సజీవ సమాధి అయ్యారంటూ వార్తల్లో నిలిచిన <<15965534>>నిత్యానంద<<>> మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈక్వెడార్ సమీపంలో ‘కైలాస’ దేశం ఏర్పాటుచేసుకున్న ఆయన కన్ను బొలీవియాపై పడినట్లు సమాచారం. నిత్యానంద అనుచరులు 20మంది $2లక్షలకు ఓ ప్రాంతాన్ని 25ఏళ్ల లీజుకు తీసుకునేందుకు స్థానిక తెగలతో డీల్ చేసుకున్నారు. వెయ్యేళ్ల లీజుకు ప్రయత్నించగా విషయం బయటికొచ్చింది. దీంతో GOVT వారిని అరెస్ట్ చేసి సొంత దేశాలకు(IND, చైనా, US) పంపింది.

Similar News

News January 7, 2026

మెుక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి సహజ కషాయం

image

మొక్కజొన్న పంటను ఆశించే కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగుల నిర్మూలనకు సహజ కషాయాన్ని రూపొందించారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివకృష్ణ. 200 లీటర్ల నీటిలో కిలో సర్ప్, అర కిలో పసుపును వేసి బాగా కలపాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఉదయం లేదా సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు వాటర్ బాటిల్‌కు రంద్రం చేసి మొక్కజొన్న మొక్క మొవ్వులో ఈ ద్రావణం వేయాలి. 25 రోజుల వయసున్న పైరులో మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.

News January 7, 2026

T20 WCకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

image

వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ 15 మందితో జట్టును ప్రకటించింది. శాంట్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
– మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్‌తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 5 T20ల సిరీస్‌లు ఆడేందుకు ఇండియా రానుంది.

News January 7, 2026

కరువు కాస్తయినా గాభరా లావు

image

కరువు కాలంలో మనకు దొరికేది తక్కువైనా.. ఆకలి, భవిష్యత్తు గురించి ఉండే భయం(గాభరా) మాత్రం చాలా ఎక్కువగా (లావుగా) ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొరత ఏర్పడినప్పుడు, ఆ సమస్య కంటే దాని వల్ల కలిగే ఆందోళనే మనిషిని ఎక్కువగా వేధిస్తుందని ఈ మాట చెబుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండనప్పుడు రైతుల ఆవేదనను ఈ సామెత ప్రతిబింబిస్తుంది.