News January 1, 2025

నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు

image

దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్‌లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News December 22, 2025

సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది: హరీశ్

image

TG: ఫోర్త్ సిటీ ఎందుకన్న <<18633868>>కేసీఆర్<<>> ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానమివ్వలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. ‘నిన్న చిట్ చాట్‌లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారు. BRS పాలనను అనేకమంది ప్రశంసించారు. సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర నీది రేవంత్. నీకు నీతి ఎక్కడుంది? రేపు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావు’ అని ఫైరయ్యారు.

News December 22, 2025

PCOSని ఎలా కంట్రోల్ చెయ్యాలంటే?

image

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వయసు, బరువుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే సరైన బరువును మెయింటైన్ చేయడం, మైండ్ ఫుల్ ఈటింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు వాడటం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

News December 22, 2025

శబరిమల భక్తులకు ‘కేరళ సద్య’

image

శబరిమలలో అయ్యప్ప భక్తులకు సంప్రదాయ కేరళ సద్య(విశేష విందు) పంపిణీ ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపప్రజ్వలన చేసి స్వామికి నివేదించారు. అనంతరం భక్తులకు వడ్డించారు. ఇందులో రైస్, పప్పు, సాంబార్, రసం, రెండు రకాలు కేరళ స్టైల్ కర్రీస్, పచ్చడి, అప్పడం, పాయసం వంటి వంటకాలు ఉంటాయి. రోజుకు 5,000 మందికిపైగా భక్తులకు రోజు విడిచి రోజు సద్య, మధ్యలో పులావ్‌ను భక్తులకు వడ్డించనున్నారు.