News January 1, 2025
నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు

దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 11, 2025
క్యాబినెట్ భేటీకి ఆలస్యం.. మంత్రులపై CM ఆగ్రహం

AP: క్యాబినెట్ భేటీకి లేట్గా వచ్చిన రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాశ్ సహా మరో మంత్రిపై CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్యాబినెట్ లాంటి కీలక భేటీకి ఆలస్యం కావడం ఏమిటి? డిసిప్లిన్ లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ లోపంతో ఆలస్యం అయ్యామని మంత్రులు చెప్పగా మళ్లీ రిపీట్ కాకూడదని స్పష్టం చేశారు. కాగా కొందరు మంత్రులు గ్రౌండ్వర్క్ చేయడం లేదని CBN అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం.
News December 11, 2025
చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.
News December 11, 2025
మొదలైన కౌంటింగ్.. గెలుపెవరిది.. తెలుసుకోండి

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వార్డు మెంబర్స్ అభ్యర్థుల ఓట్లు కట్టలు కట్టి లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటాయి. ఊర్లలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ ఎన్నికకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. Way2Newsలో మీ లొకేషన్పై క్లిక్ చేసి ఊరు, వార్డు వారీగా కౌంటింగ్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా పొందండి.


