News January 1, 2025
నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు

దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 21, 2025
U19 Asia Cup: మరోసారి ‘కప్’ గొడవ?

మెన్స్ <<17879920>>ఆసియా కప్ ట్రోఫీ<<>> విషయంలో ACC చీఫ్ నఖ్వీతో వివాదం గురించి తెలిసిందే. ఇప్పటికీ ట్రోఫీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి కప్ గొడవ జరిగేలా కనిపిస్తోంది. ఇండియా-పాక్ U19 Asia Cup <<18629192>>ఫైనల్<<>>కు నఖ్వీ హాజరవుతారని తెలుస్తోంది. మ్యాచ్ విన్నర్లకు ట్రోఫీని ఆయనే అందజేస్తారు. ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే ఆయన నుంచి ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉంది. దీంతో నఖ్వీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.
News December 21, 2025
సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో: బీజేపీ

TG: సోనియా గాంధీ త్యాగాల వల్లే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది. వ్యక్తిపూజలో రేవంత్ అన్ని హద్దులను దాటేశారని విమర్శించింది. సోనియా వల్లే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడని రేవంత్ త్వరలో చెబుతారేమోనని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
News December 21, 2025
నేలలో అధిక తేమ వల్ల ఏ సమస్యలు వస్తాయి?

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.


