News January 1, 2025
నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు

దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News November 8, 2025
బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.
News November 8, 2025
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
News November 8, 2025
ఎంత కాలం రెంట్కి ఉన్నా ఓనర్లు కాలేరు: సుప్రీం

‘ది లిమిటేషన్ యాక్ట్-1963’ ప్రకారం 12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకే కొందరు తమ టెనంట్లను ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఈక్రమంలో యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అద్దెకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పొందలేరని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టు తొలుత టెనంట్ పక్షాన నిలువగా.. సుప్రీం ఈ గందరగోళానికి ముగింపు పలికింది.


