News January 1, 2025
నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు

దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 23, 2025
గుచ్చి మష్రూమ్స్ కేజీ రూ.40 వేలు.. ఎక్కడ పెరుగుతాయి?

మంచు కరిగే సమయం, వింటర్ చివరిలో గుచ్చి మష్రూమ్స్ (మొరెల్స్/మోర్చెల్లా ఎస్కులెంటా) సహజంగా పెరుగుతాయి. HP, ఉత్తరాఖండ్, J&K ప్రాంతాల్లో లభిస్తాయి. తడి నేల, రాలిన ఆకుల కింద, దట్టమైన అడవిలో మొరెల్స్ పెరుగుతాయి. సంప్రదాయ వైద్యంతోపాటు ఖరీదైన వంటకాల్లో వినియోగం, అంతర్జాతీయ డిమాండ్తో కేజీ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో వారాలపాటు వెతికితే కొంత మొత్తంలో లభిస్తాయి.
News December 23, 2025
జనవరి 11న హీరోయిన్ నుపుర్ పెళ్లి!

హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనున్నారు. సింగర్ స్టెబిన్ బెన్తో ఉదయ్పూర్లో జనవరి 11న ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. మూడు రోజులపాటు వేడుకలు జరుగుతాయని, జనవరి 13న ముంబైలో రిసెప్షన్ నిర్వహిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో నుపుర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News December 23, 2025
రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా పరిమిత రేంజ్లో మూవ్ అయ్యాయి. చివరకు నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 26,177 వద్ద , సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 85,524 వద్ద స్థిరపడ్డాయి. ITC, అల్ట్రాటెక్, టాటా స్టీల్, HDFC లాభాల్లో.. ఇన్ఫీ, Airtel, అదానీపోర్ట్స్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.


