News April 16, 2025
నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారు: నిషాంత్

బిహార్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తిరిగి CM అవుతారని ఆయన కుమారుడు, JDU నేత నిషాంత్ ధీమా వ్యక్తం చేశారు. 2010 కంటే ఈసారి ఎక్కువ చోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిహార్ Dy.CM సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. INDI కూటమి ఎంత పోరాడినా ఫలితం ఉండదన్నారు. అటు నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్-RJD వ్యూహాలు రచిస్తోంది.
Similar News
News April 16, 2025
ఉమ్మడి తూ.గో.లో 202 పోస్టులు

ఉమ్మడి తూ.గో.జిల్లాలో 202 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 127 SGT (ప్రాథమిక స్థాయి), 75 స్కూల్ అసిస్టెంట్ల (ద్వితీయ స్థాయి) పోస్టులు మంజురైనట్లు అధికారులు తెలిపారు. వీటిని ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News April 16, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.
News April 16, 2025
అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.