News March 13, 2025

నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Similar News

News December 12, 2025

టీమ్ఇండియా చెత్త రికార్డ్

image

టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్‌కే టీమ్ఇండియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.

News December 12, 2025

100 KGలకు పైగా బరువు పెరిగే మేకలివి

image

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి బోయర్ జాతి మేకలు. ఇవి దక్షిణాఫ్రికాకు చెందినవి. అతి వేగంగా బరువు పెరగడం, నాణ్యమైన రుచిగల మాంసం, దృఢమైన శరీర నిర్మాణం ఈ మేకల ప్రత్యేకత. ఇవి కేవలం 3 నెలల్లోనే 20 కిలోలు, ఏడాదికి 70KGలకు పైగా బరువు పెరుగుతాయి. వీటిలో మగ మేకలు గరిష్ఠంగా 110-125 కిలోలు, ఆడ మేకలు 90-100 కిలోల బరువు పెరుగుతాయి. ఈ మేకల గురించి మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 12, 2025

కలిసొచ్చిన నిబంధన తొలగింపు.. సర్పంచ్‌గా గెలుపు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం పలువురికి కలిసొచ్చింది. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జనగామ(D) కొత్తపల్లి సర్పంచ్‌గా ముక్కెర స్వరూప రవికుమార్ ఎన్నికయ్యారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.