News June 15, 2024
అధికారం కోసమే నితీశ్ మోదీ కాళ్లను తాకారు: ప్రశాంత్ కిశోర్

బిహార్ CM నితీశ్ కుమార్ PM మోదీ కాళ్లను తాకి ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు. ‘నేను గతంలో నితీశ్తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరు. అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు. ఇప్పుడు NDAలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదు’ అని విమర్శించారు.
Similar News
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
ముత్తుసామి సూపర్ సెంచరీ

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.
News November 23, 2025
672 Sr రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిమ్స్ న్యూఢిల్లీ 672 Sr రెసిడెంట్/Sr డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి MBBS, DNB/MD/MS/PhD/MSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష DEC 13న నిర్వహిస్తారు. వెబ్సైట్: www.aiimsexams.ac.in/


