News March 17, 2024
నిజామాబాద్: లోక్ సభ ఎన్నికలు.. ప్రజావాణి రద్దు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ఈ విషయం గుర్తించి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
Similar News
News April 9, 2026
NZB: కాంగ్రెస్లో ముదురుతున్న కుమ్ములాటలు!

నిజామాబాద్ కాంగ్రెస్లో వర్గపోరు వీధిన పడింది. ఇటీవల పార్టీ కోసం శ్రమిస్తున్న ధర్మపురి సంజయ్కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందంటూ ఆయన అనుచరులు నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. తాజాగా జిల్లా కార్యాలయంలో నేతల మధ్య జరిగిన ఘర్షణలు, క్రమశిక్షణా చర్యలు పార్టీలో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
News April 9, 2026
NZB: నగర వాసులకు గుడ్ న్యూస్.. ఫ్లెక్సీలు పెట్టి మరీ..!

NZB నగరపాలక సంస్థ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ (రిబేటు) కల్పిస్తున్నట్లు నగరంలో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ , మేయర్ కోరారు. గడువు ముగియకముందే పౌరులు పన్ను బాధ్యతను పూర్తి చేయాలని సూచించారు.
News April 9, 2026
NZB: ఇతరులకు ఓటీపీలు చెబుతున్నారా..? జాగ్రత్త

నిజామాబాద్ జిల్లాలో నకిలీ ఖాతాలతో ₹152 కోట్ల సైబర్ మోసం వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. గతంలోనూ తక్కువ కాలంలో ఎక్కువ లాభాలంటూ ఊరించి అమాయకులను నిలువునా ముంచిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజా ముఠా అరెస్టు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని, సైబర్ నేరానికి గురైతే వెంటనే ‘1930’కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.


