News March 17, 2024
నిజామాబాద్: లోక్ సభ ఎన్నికలు.. ప్రజావాణి రద్దు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ఈ విషయం గుర్తించి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
Similar News
News January 31, 2026
నేడు వనప్రవేశం.. ముగియనున్న మేడారం మహాజాతర

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన వనప్రవేశం నేడు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య బృందం గద్దెల వద్ద రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తంతు ముగించి, తల్లి రూపమైన కుంకుమ భరిణెను తీసుకుని పూజారులు చిలుకలగుట్టకు బయలుదేరుతారు. దీంతో నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన గిరిజన కుంభమేళాకు తెరపడనుంది.
News January 31, 2026
NZB: కార్పొరేటర్ అభ్యర్థి రూ. 7.50 కోట్ల పన్ను చెల్లింపు

నిజామాబాద్ నగరపాలక సంస్థకు కాసుల వర్షం కురిసింది. ఎన్నికల నేపథ్యంలో పాత బకాయిలన్నీ వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో పోటీ చేసే అభ్యర్థులు పాత బకాయిలు కడుతున్నారు. ఇందులో భాగంగా నిన్న 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శమంత నరేందర్ తమ వంశీ హోటల్కు సంబంధించి ఆస్తి పన్ను రూ. 7.50 కోట్లు చెల్లించారు.
News January 31, 2026
NZB: నేడు నామినేషన్ల పరిశీలన

నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ ఎన్నికల సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 వార్డులకు 3 రోజుల్లో 1,231 నామినేషన్లు రాగ భీంగల్ 12 వార్డుల్లో 113, బోధన్ 38 వార్డుల్లో 342, ఆర్మూర్ 36 వార్డుల్లో 298 నామినేషన్లు వచ్చాయి.


