News March 17, 2024
నిజామాబాద్: టెన్త్ పరీక్షలు.. 141 కేంద్రాలు ఏర్పాటు

10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు DEO దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్ష కేంద్రాల్లో 22281 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలలో CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పగడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు.141 సిట్టింగ్స్ బృందాలు నియమించామన్నారు. రేపటి నుంచి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
Similar News
News August 21, 2025
SRSP వరద గేట్లను మూసేసిన అధికారులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం వరద గేట్లను మూసివేశారు. సోమవారం 40 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు నిన్నటి నుంచి క్రమక్రమంగా అన్ని గేట్లను మూసివేశారు. కాగా ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1.20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టులో తాజాగా 1089.60 అడుగుల (75.314TMC) నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వివరించారు.
News August 20, 2025
ఆర్మూర్: మినీ స్టేడియాన్ని సందర్శించిన జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి

ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియాన్ని జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి పవన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. ఆర్మూర్ క్రీడాకారుల సౌకర్యార్థం క్రీడా మైదానాన్ని ఉన్నతీకరిస్తామన్నారు. త్వరలో క్రీడా మైదానంలో వాలీబాల్, కబడ్డీ, కోకో, ప్లే ఫీల్డ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.
News August 20, 2025
భీమ్గల్ ఐ.టీ.ఐలో ATC ట్రైనింగ్ ప్రారంభం

భీమ్గల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ATC ట్రైనింగ్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. యువతను ఈ కోర్సుల్లో చేర్పించడానికి వివిధ కళాశాల ప్రిన్సిపల్స్, మండల అధికారులతో ఎంపీడీవో సంతోష్ కుమార్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత ATC(6)కోర్సులో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు.