News February 9, 2025
NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739070696402_50283763-normal-WIFI.webp)
చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News February 10, 2025
నల్గొండ: బైక్తో గేదెను ఢీకొని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739152197194_19375231-normal-WIFI.webp)
కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుర్రంపోడు మండలం మునింఖానిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ (27) మల్లేపల్లి నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ గేదెను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 10, 2025
NLG: రేపు ముసాయిదా జాబితా విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739162041515_50283763-normal-WIFI.webp)
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. NLG జిల్లాలో 33 ZPTCలు, 352 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
News February 10, 2025
నల్గొండ: ఉరి వేసుకుని యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739154509600_50311941-normal-WIFI.webp)
నల్గొండ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మహిళా ప్రాంగణం రెడ్డి కాలనీకి చెందిన వంశీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప. అతను నల్గొండ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న లిక్కర్ కంపెనీలో హమాలీగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.