News March 18, 2025
NLG: అటు పరీక్షలు.. ఇటు ముమ్మరంగా మూల్యాంకనం!

జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ముమ్మరంగా సాగుతోంది. ఇంటర్ పరీక్షలు సాగుతుండగానే.. ఈ నెల 10నే అధికారులు మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని పేపర్లను NLG కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలలో దిద్దుతున్నారు. మూల్యాంకనం నిర్వహించే ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విడతల వారీగా ఈ ప్రక్రియను చేపట్టి ఏప్రిల్ 10 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
Similar News
News January 7, 2026
3 రోజుల్లో అన్నమయ్య జిల్లాలో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News January 7, 2026
భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది.
News January 7, 2026
VZM: సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం అమలుపై జేసీ సమీక్ష

విజయనగరం జిల్లాలో అమలవుతున్న సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం నాణ్యతతో, సరైన మోతాదులో సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాల సరఫరాలో లోపాలు లేకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.


