News December 30, 2024

NLG: అతడు అడవిని సృష్టించాడు

image

ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్‌ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.

Similar News

News November 18, 2025

నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

image

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్‌పీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

News November 18, 2025

నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

image

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్‌పీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.

News November 17, 2025

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

image

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.