News March 21, 2025
NLG: అతడు అడవిని సృష్టించాడు!

ఎకరం పొలం ఉంటేనే ఏ పంట వేద్దాం, కౌలుకు ఇస్తే ఎంతొస్తది? అని లెక్కలేసుకునే రోజులివి. కానీ, హైవేకు ఆనుకొని ఉన్న 70 ఎకరాల భూమిలో మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. ఏకంగా 60 ఏళ్లు శ్రమించి 5 కోట్ల వరకు వృక్షాలను పెంచి ఆదర్శంగా నిలిచారు. ఆయనే మన రాఘవాపురం దుశ్చర్ల సత్యనారాయణ.
నేడు International Forest Day
Similar News
News January 8, 2026
సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. HYDలో ఎక్కడినుంచి అంటే?

సంక్రాంతి పండుగ సందర్భంగా రేపటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు ఎప్పటిలాగే JBS, MGBSకు పోటెత్తకుండా ప్రధాన కూడళ్ల నుంచి నడపాలని నిర్ణయించింది. సిటీలో ఎంజీబీఎస్, జేబీఎస్, గచ్చిబౌలి, ఉప్పల్, బోయిన్పల్లి, ఆరాంఘర్, KPHB, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
News January 8, 2026
కృష్ణా జలాలపై BRS, కాంగ్రెస్ది పొలిటికల్ డ్రామా: బండి సంజయ్

TG: కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు KCR అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆయన్ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమాలు చేసి KCR మెడలు వంచింది BJPనే అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, BRS లోపాయికారీ ఒప్పందంతో పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండొద్దని కేంద్రం కోరుకుంటోందన్నారు.
News January 8, 2026
‘రాజాసాబ్’ తొలి రోజే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?

రేపు విడుదలయ్యే ప్రభాస్ ‘రాజాసాబ్’పై అభిమానులతో పాటు నిర్మాత విశ్వప్రసాద్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలిరోజే రూ.100Cr కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నామన్న ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రీమియర్ షోకు రూ.1000, తొలి 10రోజులు టికెట్ రేట్ను మల్టిప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించడం కలిసొచ్చే అంశం. మరి తొలిరోజే రూ.100Cr కలెక్ట్ చేస్తుందా? COMMENT


