News March 21, 2025
NLG: అతడు అడవిని సృష్టించాడు!

ఎకరం పొలం ఉంటేనే ఏ పంట వేద్దాం, కౌలుకు ఇస్తే ఎంతొస్తది? అని లెక్కలేసుకునే రోజులివి. కానీ, హైవేకు ఆనుకొని ఉన్న 70 ఎకరాల భూమిలో మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. ఏకంగా 60 ఏళ్లు శ్రమించి 5 కోట్ల వరకు వృక్షాలను పెంచి ఆదర్శంగా నిలిచారు. ఆయనే మన రాఘవాపురం దుశ్చర్ల సత్యనారాయణ.
నేడు International Forest Day
Similar News
News November 3, 2025
గాంధారిలో 51మి.మీ. అత్యధిక వర్షపాతం

కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షం కారణంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారి 51 మి.మీ., బొమ్మన్ దేవిపల్లిలో 33, కొల్లూరు 28.5, బీబీపేట్ 21.5, నస్రుల్లాబాద్ 20.3, సదాశివనగర్ 16, సర్వాపూర్ 13.8, IDOC(కామారెడ్డి) 13, బీర్కూర్ 9.2, మక్దూంపూర్ 7, రామలక్ష్మణ పల్లి 5.8, ఆర్గొండ 5.2, మాచాపూర్ 4, హసన్పల్లి 3.8మి.మీ. నమోదయ్యింది.
News November 3, 2025
ఎటు చూసినా మృతదేహాలే..

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.
News November 3, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,920 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం రూ.7 వేలకు పైగా పలికిన పత్తి ధర.. నేడు పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.


