News December 30, 2024
NLG: అతడు అడవిని సృష్టించాడు
ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.
Similar News
News January 16, 2025
NLG: షిరిడీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!
షిరిడీ సమీపంలో జరిగిన <<15171774>>ఘోర రోడ్డు ప్రమాదం<<>>లో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కొండగడపలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రెండు రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. నిన్న ఉదయం దర్శనాంతరం తుఫాన్ వాహనంలో సమీప దర్శనీయ స్థలాలు చూసేందుకు వెళ్లి తిరిగి షిరిడీకి వస్తుండగా వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మీ(45), అక్షిత(20), వైద్విక్ నందన్(6నెలలు) మృతి చెందారు.
News January 16, 2025
రోడ్డు ప్రమాదంలో నలుగురు భువనగిరి జిల్లా వాసులు మృతి
మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భువనగిరి జిల్లా వాసులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీలో పరిధిలోని కొండగడప వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉంది. రెండు రోజుల క్రితం వీరు షిరిడీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.
News January 16, 2025
NLG: ప్రధాని మోదీతో మచ్చటించిన అంజలి
గుర్రంపోడు మండలం ఆములూరుకు చెందిన కటికర్ల శంకర్ పార్వతమ్మ దంపతుల కుమార్తె అంజలి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి హాజరయ్యింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అంజలి తన ప్రతిభా పాటవాలతో ఎన్సీఈఆర్టీ సహకారంతో ఢిల్లీ వెళ్లి ప్రధానితో మోదీతో ముచ్చటించింది. దీంతో ఆములూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అంజలిని అభినందించారు.