News October 5, 2024
NLG: అరిచాడని భర్త తల పగలగొట్టింది..!

భర్త తలను భార్య పగలగొట్టిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి శివ కాంట్రాక్టర్. కాగా భార్య, పిల్లలతో కలిసి KPHB రోడ్డు NO.3లో ఉంటున్నాడు. శుక్రవారం శివ స్నానం చేసే టైంలో వీపు తోమాలని భార్యపై అరిచాడు. ‘ఇరుగు పొరుగు వారు వింటే ఇజ్జత్ పోతుంది.. ఎందుకలా అరుస్తున్నావ్’అంటూ క్షణికావేశంలో రాయితో భర్త తల పగలగొట్టగా రక్తస్రావమైంది. అనంతరం శివ PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
News November 18, 2025
నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.


