News July 7, 2024
NLG: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ప్రతి పౌర్ణమికి ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు.
Similar News
News October 14, 2025
NLG: వాతవరణం.. వరి పంటకు ప్రతికూలం

ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది.
News October 14, 2025
NLG: పెరుగుతున్న ఆశావహులు.. డీసీసీ ఎవరికి దక్కేనో..!

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానానికి పోటీ తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణలో భారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తొలిరోజు నల్గొండలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. నిన్న నకిరేకల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో సైతం మరో ఆరుగురు డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
News October 14, 2025
NLG: బాలాజీ నాయక్ పై ఫిర్యాదుల వెల్లువ

అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 112 ఫిర్యాదులు అందాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు.