News April 25, 2024

NLG: ఇంటర్ ఫలితాలు.. 470కి 467 మార్కులు

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నల్గొండలోని గాంధీనగర్‌కు చెందిన గండమళ్ల సన్‌హిత్ దేవ్ సత్తా చాటాడు. శ్రీను ప్రసన్న దంపతులకు చెందిన సన్‌హిత్ ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. దీంతో సన్‌హిత్‌కు బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

Similar News

News January 14, 2025

SRPT: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్త హత్య

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం రాత్రి సైదులు అనే వ్యక్తిని అతని ఇద్దరి భార్యలు <<15142827>>మర్డర్ చేసిన<<>> సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. చివ్వెంల మండలానికి చెందిన సైదులు కారు డ్రైవర్. కొన్ని రోజులుగా పెద్ద భార్య కూతురిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు రోకలిబండతో సైదులును హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. 

News January 14, 2025

NLG: మరో 12 రోజులే.. దగ్గర పడుతున్న గడువు!

image

మునిసిపల్ పాలకవర్గాల గడువు దగ్గర పడుతోంది. SRPT జిల్లాలో నేరేడుచర్ల, HZNR, KDD, SRPT, తిరుమలగిరి, NLG జిల్లాలో నందికొండ, NLG, NKL, MLG, HLY, DVK, CTL, CDR, యాదాద్రి BNG జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, CPL, BNG, ఆలేరు మున్సిపాలిటీల పదవీకాలం ఈనెల 26తో గడువు ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 14, 2025

25 నుంచి జాన్‌పహాడ్ ఉర్సు.. దర్గా చరిత్ర ఇదే

image

ఈ నెల 25నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న ఈ దర్గాకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారని అంటున్నారు. మత సామరస్యానికి జాన్ పహాడ్ సైదన్న దర్గా ప్రతీక. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం. కాగా ఈ దర్గాకు నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వెళ్లొచ్చు.