News December 19, 2024
NLG: ‘ఇందిరమ్మ’ సర్వేను వెంటాడుతున్న సమస్యలు

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్ సతాయింపుతో పాటు.. గ్రామాల్లో నెట్ సక్రమంగా అందకపోవడంతో సర్వేకు సమస్యగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 4,31,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 67 వేల ఇండ్లను మాత్రమే సర్వే చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. సర్వేను సమస్యలు వెక్కిరిస్తున్నాయి.
Similar News
News December 10, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ ఎస్పీ

మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
News December 10, 2025
నల్గొండ: ‘తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి’

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొత్తం 14 మండలాల్లోని 318 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు 7,000 మంది సిబ్బంది నియమించగా, 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి మండలానికి డీఆర్సీ కేంద్రాలు, రూట్, జోనల్ అధికారులు నియమించారు. పోలింగ్ సిబ్బందికి వసతి, భోజనం, కిట్లతో సహా అన్ని సౌకర్యాలు కల్పించారు.
News December 10, 2025
NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది


